Team India:వరల్డ్ ఛాంపియన్లకి సెల్యూట్

7
- Advertisement -

భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం సాధించింది. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుతూ తొలిసారి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్-2025 ను ముద్దాడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ గెలుచుకుంది.

ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. టీమిండియా చారిత్రాత్మక విజయంపై చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, రాజమౌళి ఆనందాన్ని, అభినందనలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

భారతీయ క్రికెట్‌ చరిత్రలో ఇది ఎంతో గర్వకారణమైన, చరిత్రాత్మకమైన రోజు. సంచలన విజయాన్ని సాధించిన మన భారత మహిళా క్రికెట్‌ జట్టుకు అభినందనలుఅన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇ మీరూ ఇలానే ప్రకాశిస్తూ ఉండండి… జై హింద్ అని చిరంజీవి పేర్కొన్నారు. ఎంత అద్భుతమైన క్షణమిది… మువ్వన్నెల జెండా మునుపెన్నడూ లేనంత ఎత్తులో ఎగురుతూ, చరిత్ర తనకెంతో గర్వించదగిన అధ్యాయాన్ని జోడించింది అన్నారు మహేష్ బాబు.

కీర్తి పతాకం రెపరెపలాడుతోంది. వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచినందుకు టీమ్‌ ఇండియా మహిళల జట్టుకు అభినందనలు అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రతి భారతీయుడు మీ అద్భుత విజయానికి సెల్యూట్ చేస్తున్నారు అన్నారు దర్శకుడు రాజమౌళి.

 

 

- Advertisement -