వైష్ణో దేవి భక్తుడిగా స్టార్ హీరో

24
- Advertisement -

బాలీవుడ్ బాద్‍షా షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో చెన్నై వేదికగా జవాన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరగనుంది. అయితే ఈ ఈవెంట్‍కు ముందు షారూఖ్ ఖాన్ వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. భారీ సెక్యూరిటీ మధ్య ఆయన దేవాలయానికి వచ్చారు. గతంలో పఠాన్ సినిమా రిలీజ్‍కు ముందు కూడా షారూఖ్ ఈ ఆలయానికి వెళ్లారు. అనంతరం పఠాన్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పుడు జవాన్ కూడా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుంది అని షారూఖ్ ఖాన్ తన సన్నిహితులతో చెప్పాడట. మొత్తానికి షారూఖ్ వైష్ణో దేవి భక్తుడిగా మారిపోయాడు అని తమిళ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ బాద్‍షా గా గుర్తింపు తెచ్చుకున్న షారూఖ్ ఖాన్ దుర్గామాతను కూడా పూజిస్తాడు. ఆయన భార్య గౌరీ ప్రభావం షారూఖ్ పై ఎక్కువ ఉందట. అందుకే..వైష్ణో దేవి ఆలయానికి షారూఖ్ ఖాన్ తరుచుగా వస్తున్నారని అంటున్నారు. ఇక ‘జవాన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో షారుక్‌ ఖాన్‌ పై విజయ్‌ సేతుపతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ పార్టీలో మొదటిసారి నేను షారుక్‌ ను కలిశా. ఆయన పక్కన కూర్చొనే అవకాశం నాకు వచ్చింది. ఆరోజు ఆయన నన్ను ఎంతో ప్రశంసించారు. నా వర్క్‌ను మెచ్చుకున్నారు. ఆయన మాటలకు నేను షాకయ్యాను.

షారూఖ్ ఖాన్ అందరినీ ఒకేలా ట్రీట్‌ చేస్తారు. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అని విజయ్‌ సేతుపతి చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా షారూఖ్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ లేక డీలా పడ్డ ఈ బాలీవుడ్ బాద్‍షా.. ఎట్టకేలకు పఠాన్ తో బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు. ఇప్పుడు పారితోషికం విషయంలో కూడా షారూఖ్ ఖాన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా బాలీవుడ్ బాద్‍షా నిలిచారు.

Also Read:ఇప్పుడేందుకు ఈ కపటప్రేమ.. మోడీజీ !

- Advertisement -