డబ్బింగ్ కార్యక్రమాల్లో…’మిస్టరీ’

32
- Advertisement -

పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాత గా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మిస్టరీ”. హీరోయిన్ గా స్వప్న చౌదరి, ముఖ్య పాత్రల్లో అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, సత్య శ్రీ, వెంకట్ దుగ్గిరెడ్డి, రవి రెడ్డి , గడ్డం నవీన్, ఆకెళ్ల లు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు అలీ డబ్బింగ్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ ఇది ఒక థ్రిల్లర్ కామెడీ సినిమా, సాయి అనుకున్న కథ ని అనుకున్నట్లు తీసాడు, ఈ రోజే నా పాత్ర కి డబ్బింగ్ చెప్పుకున్నాను. టీం అందరికీ అభినందనలు అని అన్నారు.

Also Read:బ్రో..ఇంకా 10 భాషల్లో చేస్తాడట

ఈ సినిమా కి కథ మాటలు – శివ కాకు, కెమెరా – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య , సంగీతం- రామ్ తవ్వ, లిరిక్స్ – శ్రీనివాస్,పి.ఆర్.ఓ.పవన్ పాల్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ – తల్లాడ సాయికృష్ణ, నిర్మాత- వెంకట్ పులగం.

- Advertisement -