అల..వైకుంఠపురంలో”సరిలేరు నీకెవ్వరు”@దీపావళి

467
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తన్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ అండ్ హారిక హాసిని క్రియేషన్స్ సంస్ధ సంయుక్తంగా ఈమూవీ నిర్మిస్తున్నారు. ఈమూవీని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈసినిమాలోనుంచి విడుదలైన సామజవరగమన లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం కావడంతో భారీగా ఆశలు ఉన్నాయి.

కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈమూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈమూవీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈరెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కానుండటంతో బాక్సాఫిస్ వద్ద గట్టి పోటి ఉండనుంది. అంతేకాకుండా రెండు సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్స్ కూడా ఒకే రోజున రీవిల్ చేస్తున్నారు.

ఇటివలే ఇద్దరు ఒకేసారి విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా దీపావళి ట్రీట్ అందరూ ఇద్దరూ మరోసారి పోస్టర్ ను విడుదల చేశారు. మహర్షి సినిమా బ్లాక్ బాస్టర్ తో మంచి దూకుడుమీదున్నాడు మహేశ్ బాబు. నా పేరుసూర్య నాఇల్లు ఇండియా ప్లాప్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతంతో బన్ని ఖచ్చితంగా హిట్ అవసరం అనే చెప్పుకోవాలి. సంక్రాంతి పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

- Advertisement -