‘పూజా’తో ఆకుచాటు పిందె తడిసే

54
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు – టాల్ బ్యూటీ పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ శరవేగంగా పూర్తి చేసుకుంది. నాలుగో షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ షూటింగ్ లో ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. మహేష్ బాబు – పూజా హెగ్డే కలయికలో ఈ రైన్ సాంగ్ రానుంది. పున్నమి వెన్నెలలో మరోవైపు ఫుల్ వర్షంలో ఈ సాంగ్ రొమాంటిక్ గా సాగనుంది.

సీనియర్ ఎన్టీఆర్ – అతిలోక సుందరి శ్రీదేవి ‘ఆకుచాటు పిందె తడిసే’ పాట రేంజ్ లో ఈ సాంగ్ ఉంటుందట. పూజా హెగ్డే తెల్లని పల్చని చీరలో అందాలన్నీ అడ్డు అదుపు లేకుండా ధారాళంగా ఆరబోస్తోంది అని టాక్ నడుస్తోంది. అలాగే మహేష్ – పూజా హెగ్డేల పై కొన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ ను చాలా క్లోజ్ షాట్స్ లో ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇక మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా మీదకు వెళ్లాల్సి ఉంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా వేగంగా పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

Also Read: మే 15.. #BoyapatiRAPO ఫస్ట్ థండర్

తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రానున్న ఈ సినిమా పూర్తి ఢిల్లీ నేపథ్యంలో సాగనుంది. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: ‘ఎన్టీఆర్ 30’ కోసం ప్రత్యేక సెట్

- Advertisement -