సాక్షి ధోనీ సెల్ఫీ.. అదుర్స్

252
akshi is missing Chennai Super Kings
- Advertisement -

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పుడు హల్ చేసే క్రికెటర్ ల భార్యలలో ఎవ్వరైనా మహేంద్రసింగ్ ధోనీ సతీమణి సాక్షి తరువాతనే… ఎంతలా అంటే.. ఆమె పోస్ట్ చేసే ఆమె సెల్ఫీ ల కోసమే అభిమానులు ఆమె ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ ను ఫాలో అవుతుంటారు. అంతేగాదు సెల్ఫీ లు తీసుకోవడం సాక్షి కి వచ్చినంత బాగా ఎవరికీ రాదని అభిమానులు కితాబిస్తుంటారు.

akshi is missing Chennai Super Kings

ఇక తాజాగా సాక్షి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆడ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. అయితే, సీఎస్‌కే జట్టు ఎనిమిది ఐపీఎల్‌ సీజన్లలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలో ఆ జ‌ట్టు దూసుకుపోతోంటే అభిమానులు ఎంతో ఖుషీ అయ్యే వారు. ప‌సుపు ప‌చ్చ క‌ల‌ర్ జెర్సీల‌తో మైదానంలోకి ప్ర‌వేశించి వారు క‌న‌బ‌ర్చిన‌ ఆట‌తీరును అభిమానులు ఇంకా మ‌ర్చిపోలేదు.

అప్ప‌టి చెన్నై సూప‌ర్ కింగ్స్ జెర్సీ, హెల్మెట్ పెట్టుకొని ధోనీ భార్య సాక్షి ఓ సెల్ఫీ దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి ‘అప్పటి రోజులు’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్యాన్స్ ను అల‌రిస్తోంది. ఈ సెల్ఫీ అదుర్స్ అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 2015లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ యజమానులు బెట్టింగ్‌కి పాల్పడటంతో ఆ జట్టు రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కుంటున్న విష‌యం విదిత‌మే.

akshi is missing Chennai Super Kings

- Advertisement -