అక్షర ఇంటర్ నేషనల్ స్కూల్… బత్తాయి పండ్ల పంపిణీ

295
santhosh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నేడు కూకట్ పల్లి లోని అక్షర ఇంటర్ నేషనల్ స్కూల్ లో బత్తాయి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అరిశనపల్లి జగన్మోహన్ .

ఈ సందర్భంగా చైర్మన్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ విటమిన్‌ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారి దినచర్య సాఫీగా సాగుతుందని.కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని జగన్మోహన్ రావు గారు అన్నారు . బత్తాయి పండ్లలో యాంటి యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని అన్నారు. స్కర్వీ వ్యాధి నివారణకు, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తయని ఆయన అన్నారు. బత్తాయి పండ్లను బాగా తినటం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహించి రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందని అన్నారు.

బత్తాయి పండ్లను కొనుగోలు చేసి వాటిని సాగుచేసే రైతులను ఆదుకోవాలన్న సీఎం కెసిఆర్ మాటలను కూడా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మంచి ఆలోచనలతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన బత్తాయి డే కార్యక్రమం ఎంతో విజయవంతమైందని… ఇంత మంచి ఆలోచన సంతోష్ కుమార్ గారికి రావడం రైతన్నలకు ఎంతో మేలు జరిగిందని జగన్మోహన్ రావు గారు అన్నారు…

santhosh santhosh

- Advertisement -