పెర్ఫ్యూమ్ కంపెనీ ఓనర్ గా నాగార్జున

647
- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రస్తుతం మన్మధుడు2 లో బిజీగా ఉన్నాడు. మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా వస్తున్న సంఘటిత తెలిసిందే. ఈచిత్రానికి యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ఆగస్ట్ 9న విడుదల చేయనున్నారు. ఈసినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ నటిస్తోంది.

మన్మధుడు సినిమాలో నాగార్జున లిప్ స్టిక్ కంపెనీ డైరెక్టర్ గా కనిపించారు. అయితే మన్మధుడు2లో మాత్రం పెర్ఫ్యూమ్ కంపెనీ ఓనర్ గా కనిపించనున్నాడట. ఈసినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తుండగా, కీర్తి సురేష్ అదితి పాత్రలో కనిపించనున్నారు. ఈసినిమా తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా కు సీక్వేల్ బంగార్రాజు మూవీ చేయనున్నారు.

- Advertisement -