మజ్ను ప్రమోషన్‌..థాంక్యూ బ్రదర్స్

280
akhil
- Advertisement -

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా టాలీవుడ్‌ స్టార్స్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు అఖిల్‌. నాకు తెలిసిన మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ట్యాగ్‌ టీం. నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు బ్రదర్స్ అని క్యాప్షన్‌ ఇస్తూ ‘బాయ్స్‌ విల్‌ బీ బాయ్స్‌’ అని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు. ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే అరవై వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. మూడు సింహాలు ఒక్కచోట చేరాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అఖిల్ నటిస్తున్న మూడోచిత్రం మిస్టర్ మజ్ను కావడంతో ఈసారైన హిట్ కొడతాడా అని అభిమానులు వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు చరణ్‌, తారక్‌.. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)మల్టీస్టారర్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల సినిమా రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది.

- Advertisement -