TTD:అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

12
- Advertisement -

లోక కళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూలై 10వ తేదీ అయోధ్యకాండ 12వ విడ‌త‌ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఎస్వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వ విద్యాలయం, టీటీడీ వేదపండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అయోధ్యకాండలోని 45 నుండి 49 సర్గలలోని 141 శ్లోకాలు, పారాయణం చేస్తారు. ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం పండితులు శ్రీ రామానుజా చార్యులు, శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేస్తారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొనవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read:KTR:వడ్డీతో సహా చెల్లిస్తాం

- Advertisement -