సీఎం కేసీఆర్ మరింత ప్రజాసేవ చేయాలి: ఓవైసీ

96
owaisi
- Advertisement -

ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ మ‌రింత సేవ చేయాల‌న్నారు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లును సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం మాట్లాడిన ఓవైసీ…. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

ప్ర‌జ‌ల ఆకాంక్షలు నెర‌వేరాలంటే సీఎం కేసీఆర్ అవ‌స‌రం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంద‌ని….తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలను ఇతర రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకుని అమ‌లు చేస్తున్నాయ‌న్నారు.

పోలీస్, మెడిక‌ల్, ఎడ్యుకేష‌న్ విభాగాల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు ఉచితంగా కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఓవైసీ సూచించారు. పాత‌బ‌స్తీలో స్ట‌డీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు.

- Advertisement -