అజిత్‌కు విలన్‌ దొరికేశాడు

15
- Advertisement -

టాలీవుడ్‌లో అజిత్ ఫ్యాన్స్ చాలా తక్కువ మంది ఉంటారని మనందరికి తెలుసు. కానీ తమిళంలో అజిత్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ప్రేమ పుస్తకంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అతర్వాత వచ్చిన వాలి ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి భారీ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న తమిళ హీరో. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో అజిత్ నటించిన తునివు తెలుగులో తెగింపు తెరకెక్కించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలకు సిద్దమయ్యింది. వెనువెంటనే మరో ప్రాజెక్ట్‌ కూడా స్టార్ట్‌ చేయబోతున్నారని కోలీవుడ్‌లో టాక్.

తన తదుపరి సినిమాను విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో …ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా పూర్తి చేసుకున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా జనవరి 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే ఈ సినిమాకు సంబందించి చిత్ర యూనిట్‌ ఓ బిగ్ అప్డేట్‌ ఇచ్చింది. నాటి కోలీవుడ్‌ మిల్క్‌భాయ్‌ ఆరవింద్ స్వామి ఇందులో విలన్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. అంతే కాదు ఈయన క్యారెక్టర్‌ తెలుగులో వచ్చిన దృవ సినిమా మాదిరి స్టైలిష్‌గా ఉంటుందని కోలీవుడ్‌ టాక్.

అరవింద్‌ స్వామితో పాటు సంథానం కూడా కీలక పాత్రలో నటించనున్నారు. అజిత్ అండర్‌ వరల్డ్ డాన్‌గా నటిస్తున్నారని…నయనతార కూడా కథానాయిక పాత్రలో నటిస్తుంది. వీరిద్దరు గతంలో రెండు సినిమాలో నటించారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా… మాఫియా మ్యూజికల్ రాక్ స్టార్‌ అనిరుధ్‌ రవిచంద్రన్ బాణీలు సమకూర్చనున్నారు.

ఇవి కూడా చదవండి…

వీర సింహా రెడ్డి ట్రయిలర్ టాక్

చైతు యమా స్పీడుగా

హీరోయిన్ కోసం గొడవపడ్డ ప్రభాస్‌, గోపిచంద్

- Advertisement -