- Advertisement -
శ్రీలంకలో నెగ్గొచ్చిన ఇంగ్లండ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోం అన్నారు టీమిండియా వైస్ కెప్టెన్ రహానే. ప్రస్తుతం టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తిరిగి రావడంతో తన పని సులువైందని…కెప్టెన్కు చేదోడు వాదోడుగా ఉంటానని వెల్లడించాడు.
జో రూట్ బృందం బలమైన ప్రత్యర్థి. అలాంటి జట్టుని తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పుడు నేను వైస్కెప్టెన్ని. మా సారథి వెంట నడవాలి. జట్టుకు అవసరమైనపుడు సలహాలిస్తానని వెల్లడించారు.
కోహ్లి కోరితే సూచనలిస్తానని తెలిపిన రహానే…ప్రస్తుతం మా ఫోకస్ అంతా ఇంగ్లాండ్ సిరీస్పైనే ఉందన్నారు. పైగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రత్యర్థి ఎవరైనా పట్టుదలతోనే ఆడతాం అని వెల్లడించారు.
- Advertisement -