రజినీతో మరోసారి ఐశ్వర్యా రాయ్ రొమాన్స్‌?

113
Aishwarya Rai
- Advertisement -

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్‌ హీరోలతో పోటీపడుతూ పలు మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇక తలైవా తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. రజినీకి ఇది 169వ సినిమా. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో రజినీ భార్య పాత్రలో ఐశ్వర్య రాయ్ నటించనుంది. కాగా, రోబో సినిమాలో రజినీకాంత్ గర్ల్ ఫ్రెండ్‌గా రొమాన్స్ చేసింది ఐశ్వర్య రాయ్.

కాగా, ఇప్పుడు రజినీ,ఐశ్వర్య రాయ్ కాంబో మరోసారి సెట్ అయింది. రోబో తర్వాత..రజినీ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడిన..ఐశ్ మాత్రం అపుడపుడు స్కీన్ మీద కనిపిస్తుంది. 2018లో ఫన్నేఖాన్‌లో నటించింది. ఇప్పుడు మణి రత్నం పొన్నియన్ సెల్వమ్‌లో యాక్ట్ చేస్తుంది. ఇన్నాళ్లకు మళ్లీ రజినీతో సినిమా చేయబోతుంది ఐశ్వర్ రాయ్. మరోవైపు ఈ మూవీలో ఒక పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందని సమాచారం. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

- Advertisement -