అరుదైన అవార్డ్ అందుకున్న ఐష్..

236
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్ పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ ఇప్పటికీ ఆమె అందం చెక్కు చెదరలేదు. అందుకనే ఆమె విశ్వసుందరి అయింది. ఇక ఆమె అందమే ఇప్పటికే ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెడుతోంది. ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా రాజధాని వాషింగ్టన్లో శనివారం నిర్వహించిన విఫ్ట్(వుమెన్ ఇన్ ఫిలింస్ అండ్ టిలివిజన్) అవార్డ్స్‌లో ఐశ్వర్య రాయ్‌కు ప్రత్యేకించి మెరిల్ స్ట్రీప్ పురస్కారం దక్కింది.

Aishwarya Rai Bachchan

భారతదేశం నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్య రాయ్. ఈ వేడుకల్లో తన తల్లి బృందా రాయ్ – కుమార్తె ఆరాధ్యతో పాల్గొంది. ఇక ఇటీవల ‘ఫ్యాన్నే ఖాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఐశ్వర్య రాయ్‌. రాజ్‌కుమార్‌ రావ్‌, అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. త్వరలో ఆమె తన భర్త అభిషేక్‌తో కలిసి ‘గులాబ్‌ జామున్‌’ అనే సినిమాలో నటించబోతున్నారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

- Advertisement -