ఎయిర్‌టెల్‌ నుండి సరికొత్త ఆఫర్‌‌..

231
- Advertisement -

రిలయన్స్‌ జియో ఎఫెక్ట్‌తో టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు రోజుకో కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌ మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.159కి ఓ నూతన ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది.

Airtel's New Offer

ఇందులో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 21 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఇక జియోలో రూ.149 కి అందుబాటులో ఉన్న ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతోపాటు ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.

- Advertisement -