24 నుంచి బేగంపేటలో ఎయిర్‌షో…

164
airsow
- Advertisement -

గ్రేటర్ ప్రజలకు గుడ్ న్యూస్‌. ఎప్పటినుండో ఎయిర్‌ షో కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తీపికబురు చెప్పారు అధికారులు. ఈ నెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్‌ షోను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.

బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా నాలుగు రోజుల పాటు ఈ ఎయిర్ షో జరగనుంది. తొలి మూడురోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.

ఈ ఎయిర్ షోలో పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -