ఆ మూడు చిత్రాలకు ఓటీటీ కీలకం

19
- Advertisement -

ఓటీటీల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రిలీజ్ అయిన క్రేజీ సినిమాలు కూడా పెద్దగా కాల వ్యవధి లేకుండానే స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వంలో యంగ్ హీరో నవీన్, అనుష్క జంటగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 5 నుంచి నెట్‌ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. అయితే ఈ సినిమా థియేటర్‌ లలో మంచి టాక్‌ ను సంపాదించుకున్నా.. ఇక ఓటీటీ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

అలాగే మరో సినిమా విషయానికి వస్తే.. అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఏప్రిల్-28న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఏజెంట్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర ఏజెంట్ చిత్రం పెద్దగా కలెక్షన్స్ ను రాబట్టలేక పోయింది. మరి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తోందో చూడాలి.

అలాగే విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 2016లో చిత్రాన్ని ప్రారంభించగా 2017లో షూటింగ్ పూర్తైంది. అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆరేళ్ల తర్వాత నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే జనవరిలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి ఈ మూడు సినిమాలకు ఓటీటీ రిలీజ్ కీలకం కానుంది.

Also Read:ఆలివ్ పండు తింటే ఆ సమస్యలన్నీ దూరం!

- Advertisement -