మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 30వేల కోళ్లు మృతి!

2
- Advertisement -

తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మృత్యువాత పడగా తాజాగా మరో 30 వేల కోళ్లు చనిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్లఫామ్ లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి.

విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపడంతో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లు, మాస్క్ లు ధరించి ఫామ్ లోకి వెళ్లి మొత్తం 29,796 కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేశారు. అనంతరం గొయ్యి తీసి వాటిని పాతిపెట్టారు.

ఫాంలోని దాదాపు 20వేల కోడిగుడ్లను, కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా పూడ్చిపెట్టారు. యాదాద్రి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య మాట్లాడుతూ.. కోళ్లఫామ్ లోని 90 టన్నుల దాణాతో పాటు కోళ్ల పెంటనుసైతం దహనం చేస్తామని చెప్పారు. కోళ్ల ఫాం నుంచి కిలో మీటర్ పరిధిలో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేస్తామని, మూడు నెలల వరకు పౌల్ట్రీ ఫామ్ ను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

Also Read:ఒత్తిడి ఎక్కువైతే.. అల్జీమర్ మప్పు?

- Advertisement -