‘జాకీ’గా మారనున్న అఖిల్..?

257
Akhil Akkineni
- Advertisement -

అక్కినేని అఖిల్ గతంలో వచ్చిన రెండు చిత్రాలతో అశించినంతగా విజయం సోంతం చేసుకోలేకపోయాడు. ఎలాగైనా మంచి విజయం అందుకోవలని అఖిల్ తన తదుపరి చిత్రాన్ని ప్రాంరంభించిన సంగతి తెలిసిందే. అఖిల్‌ 3వ సినిమాగా చేస్తున్న ఈ మూవీ ‘మిస్టర్ మజ్ను’ పేరుతో తెరకెక్కుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

Akhil Akkineni

అయితే ఈ సినిమా తరువాత .. రొమాన్స్‌తో కూడిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఈ అక్కినేని హీరో చేయనున్నట్టు సమాచారం. ఆది పినిశెట్టి సోదరుడు ‘సత్య ప్రభాస్’ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఆయన అఖిల్‌కి కథ వినిపించడం .. అఖిల్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఇందులో అఖిల్ గుర్రపు స్వారీ చేసే యువకుడిగా కొత్త తరహాలో కనిపించేలా సత్య డిజైన్ చేసినట్టు టాక్. రొమాన్స్ యాక్షన్ థ్రిల్ అన్ని సమపాళ్లలో ఉంటూనే సరికొత్త అనుభూతినిచ్చేలా ఇది రాసుకున్నట్టు సమాచారం.

ఇక హీరోలు జాకీలుగా నటించిన సినిమాలు చాలా తక్కువ. 80వ దశకంలో బాగానే వచ్చేవి కానీ ఈ లైన్ మీద తెలుగులో మాత్రం రావడం మానేశాయి. ఆ రకంగానూ ఇది ఫ్రెష్ గా అనిపిస్తుందని సత్య ప్రభాస్ నమ్మకంగా ఉన్నాడట. షూటింగ్ ప్రారంభానికి కొంత టైం పట్టొచ్చు. మిస్టర్ మజ్ను పూర్తి చేసి దాని ప్రమోషన్ ఒక కొలిక్కి వచ్చే దాకా అఖిల్ అందులోనే బిజీగా ఉంటాడు. మిస్టర్ మజ్ను సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.

- Advertisement -