ఆదిపురుష్ ట్రైలర్ కి టైమ్ లాక్

94
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ థియేట్రికల్ ట్రైలర్ రేపు విడుదల కాబోతుంది. రేపు సాయంత్రం 5:04 గంటలకు యూట్యూబ్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. కాగా, ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రభాస్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా టీజర్ మాత్రం నిరుత్సాహపరిచింది. అందుకే, ట్రైలర్ విషయంలో దర్శకుడు ఓం రౌత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. ఈ సినిమాలో ప్రభాస్ కి కృతిసనన్ జోడీగా నటిస్తోంది. అన్నట్టు ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో 15 దేశీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీని మోషన్ కాప్చర్ విధానంలో షూట్ చేస్తున్నారు.

Also Read:ఉత్కంఠపోరులో హైదరాబాద్ గెలుపు..

అంటే.. నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డు చేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారు. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ హై-బడ్జెట్ చిత్రంలో సన్నీ సింగ్ కూడా కీలక పాత్రలో కనిపించాడు. జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. వచ్చే వారం నుంచి చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతోంది. బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా చేయడం నిజంగా విశేషమే.

Also Read:ఆర్ఎస్‌ఎస్‌తో దేశానికి పెను ముప్పు?

- Advertisement -