ఓ మై గాడ్ 2పై ఆదిపురుష్ ఎఫెక్ట్!

32
- Advertisement -

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్‌. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ అయినా తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అన్నివర్గాల నుండి ఒత్తిడి రావడంతో ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాదని చెప్పుకోవాల్సి వచ్చింది రైటర్.

ఇక ఏ సినిమా అయినా బయటకి రావాలంటే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే ఆదిపురుష్ వివాదం తలెత్తిన నేపథ్యంలో సెన్సార్ బోర్డుపై కూడా పెద్ద ఎత్తన విమర్శలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన బోర్డు సభ్యులు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కతున్న ఓ మై గాడ్ 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి సెన్సార్ బోర్డ్ చూడటమే కాకుండా ఒక రివ్యూ కమిటీకి కూడా ఈ సినిమాని చూపించబోతున్నారట. అనంతరం సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది.

ఇటీవలే ఓ మై గాడ్ 2 టీజర్ రిలీజ్ కాగా ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు. గత సినిమాలో కృష్ణుడితో తీస్తే ఇప్పుడు శివుడి పాత్రతో తీస్తున్నారు.

Also Read:త్రివిక్రమ్ బ‌జ్ ఎలా క్రియేట్ చేస్తాడో?

- Advertisement -