గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అపూర్వ స్పందన..

185
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన వస్తోంది. తనవంతుగా ఆరు అంబులెన్స్‌లను తన స్వంత ఖర్చులతో ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించగానే పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు ముందుకువచ్చి తమవంతు సాయాన్ని అందించారు.

తాజాగా మరికొంత మంది ప్రజా ప్రతినిధులు ఈ రోజు అంబులెన్సులు అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పురపాలక సంఘాల రివ్యూ సందర్భంగా ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అంబులెన్సులు ఇస్తామని మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.

జోగు రామన్న-అదిలాబాద్, విట్టల్ రెడ్డి-ముధోల్ , దివాకర్ రావు-మంచిర్యాల్, రేఖానాయక్-ఖానాపూర్, దుర్గం చిన్నయ్య-బెల్లంపల్లి ఒక్కొక్కరు ఒక్కో అంబులెన్స్ చొప్పున అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంబులెన్సులు అందించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్ అభినందించారు.

- Advertisement -