బీజేపీ తగిన మూల్యం తప్పదు: అద్దంకి

1
- Advertisement -

ఈడీ దాడులపై స్పందించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బీజేపీ చేస్తున్న కుట్రలోని భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పై ఈడీ దాడులు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులను భయపెట్టడానికి, వారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న కుట్ర ఇది అన్నారు.

సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా భయపెట్టడానికి నిరంతరం దాడులు చేశారని…కర్ణాటక లో డీకే శివకుమార్ పై కూడా దాడి జరిగిందన్నారు. దీని వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదని…బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు.

ఎలాంటి చెడ్డ పేరు లేకుండా మంచి వ్యాపార వేత్త గా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. సీబీఐ, ఈడీ లను ఉపయోగించుకొని బిజేపి వ్యతిరేక ముఖ్యమంత్రులు, మంత్రుల పై దాడి చేయిస్తున్నారు అన్నారు. అన్ని రాష్ట్రాలలో ఆర్థికంగా బలపడిన కాంగ్రెస్ నాయకులు,ప్రతిపక్ష నాయకులు పై దాడులు జరుగుతున్నవి…ఇది బీజేపీ మార్క్ రాజకీయానికి ఇది పరాకాష్ట అన్నారు దయాకర్.

Also Read:గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తా: బుర్రా శ్రీనివాస్

- Advertisement -