మొక్కలు నాటిన సినీనటి త్రిపుర..

84
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటి త్రిపుర నిమ్మగడ్డ. ఈ సందర్భంగా త్రిపుర నిమ్మగడ్డ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు.

వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని అన్నారు.అనంతరం సాత్విక జై,యస్వీ కనకాల,యాంకర్ జాను ముగ్గురికి కి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు త్రిపుర.

- Advertisement -