గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నటి శ్రీవాణి..

69
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో టీవీ నటి శ్రీవాణి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీ వాణి మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని శ్రీవాణి కోరారు. అనంతరం టివి ఆర్టిస్ట్స్ నవీన,హిమజ,శివజ్యోతి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు శ్రీవాణి.

- Advertisement -