గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి మీనాక్షి గోస్వామి

155
Actress Meenakshi Goswami
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటి మీనాక్షి గోస్వామి బుధవారం జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్క నాటారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నరేంద్రనాథ్,నిర్మాత మధు,అలీ రేజా ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు మీనాక్షి గోస్వామి.

- Advertisement -