మొక్కలు నాటిన నటి మీనాక్షి చౌదరి..

204
Actress Meenakshi Chowdary
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటి మీనాక్షి చౌదరి ఈరోజు జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్బుతమని కొనియాడారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యమై మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతొష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా సినీ నటి అక్షర హసన్,నటులు సిద్దార్థ శంకర్,విజయ్ ఆంటోనీ ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు మీనాక్షి చౌదరి.ఈ కార్యక్రమ అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మీనాక్షి చౌదరికి వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.

- Advertisement -