మొక్కలు నాటిన సినీ నటి మనాలి రాథోడ్…

161
green
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన వస్తుంది.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ని స్ఫూర్తిగా తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సేవాలాల్ మహరాజ్ జయంతి ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన సినీ నటి మనాలి రాథోడ్ , సింగర్ బిక్షు నాయక్ , MKG గ్రూప్ చైర్మన్ డా.రవీందర్ నాయక్.

అనంతరం మాట్లాడుతూ మా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సినీ నటి మనాలి రాథోడ్ , సింగర్ బిక్షు నాయక్ , MKG గ్రూప్ చైర్మన్ డా.రవీందర్ నాయక్ తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపుతూ ఈ నెల 17 తేదీన సీఎం కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టబోతున్న ” కోటి వృక్షార్చన ” కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి విజయవంతం చేయాల్సింది గా సినీ నటి మనాలి రాథోడ్ , సింగర్ బిక్షు నాయక్ , MKG గ్రూప్ చైర్మన్ డా.రవీందర్ నాయక్ తెలిపారు…

- Advertisement -