ప్రజాస్వామ్యం వన్‌ వే ట్రాఫిక్ కాదు: ఖుష్బూ

2
- Advertisement -

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌, న‌టి కుష్బూ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేసింది. రెండు నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి భాష మాట్లాడతార‌ని అనుకున్నాను…కానీ ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నాను అన్నారు.

కొండా సురేఖ గారూ.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయ‌రాదు అన్నారు.

ఇలాంటి ఆధారం లేని ఆరోప‌ణ‌లు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదు…ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణల చేసినందుకు మీరు మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, కానీ మేము మీ స్థాయికి దిగజారలేం అని కుష్బూ ట్వీట్ చేశారు.

Also Read:Bigg Boss 8 Telugu: ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో తెలుసా!

- Advertisement -