రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్‌ అందించాలి: కావ్య

102
kavya
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్ని మొక్కలు నాటి పర్యవరణంపై ప్రేమను చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటి కావ్య కళ్యాణ్ రామ్ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా నటి కావ్య మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్ష లాది మొక్కలు నాటడం అందులో చిన్న, పెద్ద మరియు సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అందరిని భాగస్వామ్యం చెయ్యడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో మసుధ మూవీ టీమ్‌ పాల్గొన్ని మొక్కలు నాటాలని నటి కావ్య ఛాలెంజ్‌ విసిరారు.

- Advertisement -