గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బాస్ బ్యూటీ..

217
Actress Ashu Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సావిత్రి (శివజ్యోతి)విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషూ రెడ్డి ఈరోజు జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ ఛాలెంజ్ ఇచ్చిన శివ జ్యోతికి మరియు ఇంత మంచి కార్య క్రమం ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడడం మన బాధ్యత అని అశు రెడ్డి అన్నారు. మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.గ్రీనరీ పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అషురెడ్డి కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సన్నీ,దీపక్ సరోజ్,జశ్వంత్ ముగ్గురు నటులకు ఛాలెంజ్ విసిరారు అశు రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.

- Advertisement -