మొక్కలు నాటిన నటుడు తనీష్..

82
thanish
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటుడు తనీష్. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

తెలంగాణ లో గ్రీనరి పెంచేందుకు ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటలని కోరారు.ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.తనను అభిమానించే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తనీష్ పిలుపునిచ్చారు…

- Advertisement -