సిట్ ముందుకు తరుణ్‌…

178
actor tarun at sit investigation
- Advertisement -

డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజులను విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇవాళ నాలుగో రోజు హీరో తరుణ్‌ని సిట్ విచారించనుంది. తండ్రితో కలిసి సిట్ కార్యాలయానికి తరుణ్ చేరుకున్నారు.క్రికెటర్ కావాలని కలలు కని, సినిమాల్లో ఆకట్టుకున్న తరుణ్ సొంతగా పబ్ ను నడుపుతున్నాడు. ఈ పబ్ నుంచే ఇతర పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

తరుణ్ పై సంధించేందుకు సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్‌ మాఫియాతో లింకులు, గతంలో డగ్స్‌ తీసుకున్నారా తదితర ప్రశ్నలను సిట్‌ అధికారులు తరుణ్‌ కోసం సిద్ధం చేశారు.

ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌లో తనకు  హైదరాబాదులో పబ్ ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని  తరుణ్ తెలిపారు.  ఏడేళ్ల క్రితం ఓ పబ్ లో తాను పార్ట్ నర్ గా ఉండేవాడినని చెప్పాడు. ఆ పబ్ లో పార్ట్ నర్ షిప్ వదులుకుని ఆరేళ్లు దాటుతోందని… ప్రస్తుతం ఆ పబ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తన నిజాయతీ ఏంటో సిట్ ముందు నిరూపించుకుంటానని చెప్పాడు.

పూరీని 13 గంటలు, శ్యామ్ కే నాయుడును 11 గంటలు, సుబ్బరాజును 13 గంటలు విచారించిన సిట్ అధికారులు తరుణ్ ను ఎంతసేపు విచారించనున్నారో తెలియాల్సి ఉంది.ఇవాళ  పబ్  ఓనర్లతో  అకున్ సబర్వాల్ భేటీ కానున్న నేపథ్యంలో తరుణ్ విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -