మంత్రి కేటీఆర్‌పై నటుడు సోనూసూద్‌ ప్రశంసలు..

62
- Advertisement -

హైదరాబాద్‌లోని హెచ్ ఐసిసిలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీ రామారావు ,హీరో సోను సూద్ హాజరైయ్యారు. వీరితో పాటు ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటుడు సోనూసూద్ మాట్లాడుతూ.. కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉండదు అని ప్రశంసించారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లకు సహాపడటమే ఇక మన ముందున్న సవాలు.. జమ్మూ నుండి కన్యాకుమారి వరకు నేను సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుండే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ నాకు తారసపడింది.. అది కేటీఆర్ కార్యాలయం అని సోనూసూద్‌ తెలిపారు.

- Advertisement -