ఎన్టీఆర్‌నే చంపాడు..జగన్‌ ఓ లెక్కా:బాబుపై పోసాని ఫైర్

328
posani
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు సినీ దర్శకుడు పోసాని కృష్ణమురళి. సోమవారం మీడియాతో మాట్లాడిన పోసాని ఎడిటింగ్ దశలో ఉన్న తన సినిమాపై అప్పుడే ఈసీకి ఫిర్యాదుచేయడం దుర్మార్గమన్నారు. అసలు ఏం సినిమా తీశానో, అందులో ఏ సన్నివేశాలున్నాయో కూడా తెలియకుండానే ఓ అనామకుడు చేసిన ఫిర్యాదుపై ఈసీ గుడ్డిగా స్పందించిందన్నారు. దేశం మొత్తానికి ఉపయోగపడే సినిమా తీస్తే ఆ సినిమా గురించి తెలియకుండానే ఫిర్యాదులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్‌లపై తాను ఫిర్యాదు చేస్తే వారినీ పోలీసులు పిలిపిస్తారా..? అని ప్రశ్నించారు పోసాని. అధికారంలో ఉన్నవాళ్లకు ఒక రాజ్యాంగం.. సామాన్యులకు ఒక రాజ్యాంగమా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పెద్ద దొంగ. వెన్నుపోటు పొడుస్తాడు. కులాలను కించపరుస్తూ దూషిస్తాడు. ఇవన్నీ జనాలకు తెలుసు. ఏం తెలియదని బాబును టార్గెట్‌ చేసే సినిమా తీయాలి? ఆయన తప్పులు చేయొచ్చు.. కానీ నేను సినిమా తీయకూడదా? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యపై స్పందిస్తూ ఎన్టీఆర్‌నే చంపిన వ్యక్తికి జగన్‌ ఓ లెక్క కాదు. నోట్లో నుంచి లింగాలు తీసినట్టు చంపుతారు… లెటర్లు సృష్టిస్తారు. అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వల్లే గతంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పవన్‌ను, ఆయన కుటుంబసభ్యులను తిడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -