కరోనా.. మోహన్‌బాబు సంచలన నిర్ణయం..

236
Mohan Babu
- Advertisement -

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రించడాని అందరూ తమవంతు బాధ్యత వహించాలని పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు వారికి సంబంధించిన ష్యూటింగ్స్‌,ఈవెంట్స్‌ అన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటుడు మోహన్‌బాబు కీలక ప్రకటన చేశారు.

ఈ ఏడాది మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యా నికేతన్ పాఠశాల, కళాశాలల వార్షికోత్సవాన్ని, అదే రోజున జరుపుకుంటున్న నా పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేస్తున్నాను’ అని తెలిపారు. తనకు అభినందనలు తెలియజేయడానికి రావద్దని అందరికీ సూచించారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

‘పంచభూతాలు మనకు ఇచ్చిన వరాలను మనమే శాపాలుగా మార్చుకుంటున్నాం. ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం.. అందుకే ఈ కరోనా వ్యాధి ఒక దేశము నుంచి మరో దేశానికి గాలి కంటే వేగంగా ప్రయాణిస్తోంది’ అని తెలిపారు. ‘ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మోహన్‌బాబు తెలిపారు.

press note mb

- Advertisement -