మొక్కలు నాటడం గర్వంగా ఉంది- నటుడు అమిత్‌

57
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు సినీ నటుడు అమిత్ తివారి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు.ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.

మొక్కలు నాటడం గర్వంగా ఉందని అన్నారు. మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అమిత్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తన స్నేహితులు కాలకేయ ప్రభాకర్,కిరీటి దామరాజు,రాఘవ ముగ్గురికి గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -