20న ఓటీటీలో ఆచార్య!

100
chiru
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగ తెరకెక్కిన చిత్రం ఆచార్య. మిక్స్‌ డ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ళ పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే దూసుకుపోతోంది. చరణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది.

- Advertisement -