వాళ్లు నా ఫ్యాన్స్ కాదు: ఎన్టీఆర్

333
ntr
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై నటి మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు మంత్రి కేటీఆర్‌ను కోరింది.

వివాదం పెద్దది కావడంతో స్పందించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన అభిమానులు ఎవరు ఆడవారిని ఇలా వేధించరని వారు తన ఫ్యాన్స్‌ కాదని క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. కొంతమంది కావాలనే తన పేరును బ్యాడ్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

అసలేం జరిగిందంటే…సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మీరా చోప్రా. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి ఓ నెటిజన్ ప్రశ్న అడగగా పవన్‌.. మంచి వ్యక్తని..తాను మహేశ్ బాబు ఫ్యాన్‌ని చెప్పుకొచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ నెటిజన్ అడగగా ఆయనెవరో తనకు తెలియదని తెలిపింది.

దీంతో కొంతమంది సోషల్ మీడియాలో మీరాచోప్రాపై వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. దీంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది మీరా చోప్రా. ఇక మీరా విజ్ఞప్తికి స్పందించిన మంత్రి కేటీఆర్…వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డిని కోరారు.

- Advertisement -