గ్రీన్ ఛాలెంజ్‌: మొక్కలు నాటిన అంటార్కిటికా అంబాసిడర్..

73
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 2041 క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా అంబాసిడర్ అభిషేక్ సోబ్బనా ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రతి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి అని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడం ద్వారా వాతావరణ మార్పులను అరికట్టవచ్చని అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని.. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని అభిషేక్ కోరారు.

- Advertisement -