గోపీచంద్, బి.గోపాల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. దాదాపు మూడేళ్లుగా సెట్స్పై వున్న ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకి రిలీజ్కి రెడీ అయింది. ఫేమస్ డైరెక్టర్ బి గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆరడుగుల ఆజానుబాహుడు గోపీచంద్ సరసన నయనతార జంటగా నటించింది. మూడేళ్ల క్రితమే మొదటిసారి సెట్స్పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్కి ఆ తర్వాత అనేక కారణాలతో అనేక సందర్భాల్లో బ్రేకులు పడ్డాయి.
వక్కంతం వంశీ కథతో.. అబ్బూరి రవి మాటలతో.. బి. గోపాల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. లాంగ్ టైమ్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతోంది. సెన్సార్ ఫార్మాల్టీస్ సైతం పూర్తి చేసుకుందీ సినిమా. సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఆరడుగుల బుల్లెట్ జూన్ 9న రిలీజ్ కానుంది.
ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, కోట, అభిమన్యుసింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. టీజర్ తో ఆకట్టుకున్న ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్ తో అంచనాలను మరింతగా పెంచేసింది. చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్ గోపీచంద్ కు ‘ఆరడుగుల బుల్లెట్’తో ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.