గ్రీన్ ఛాలెంజ్‌లో ఆకెళ్ళ రాఘవేందర్

77
Raghavendra
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా దిల్ సుఖ్‌ నగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు Gurukulam for IAS founder, మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ళ రాఘవేందర్.

ఈ సందర్భంగా రాఘవేందర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముక్యమయిన రోజుగా భవిస్తున్నాను అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మొక్కలను మనం రక్షిస్తే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని, అందమయిన ప్రకృతి వాతావరణం లో ఆరోగ్యం గా ఉండవచ్చని అన్నారు. అనంతరం నటుడు ఆకాష్ పూరి, నవీన్ యాదవ్, డాక్టర్ దీపిక కొమ్మిరెడ్డ్ ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -