ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తాం:రేవంత్

2
- Advertisement -

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు…సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యాయి. ఆదివాసీలు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవతో రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు ఆదివాసీ సంఘాల నాయకులు. తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని సీఎంను కోరారు ఆదివాసీలు. దీపావళి లోపు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, డిమాండ్ల సాధ్యసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు.

Also Read:కూర్మాసనంతో ఉపయోగాలు!

- Advertisement -