‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టీజర్‌ రిలీజ్..

51
- Advertisement -

టాలీవుడ్‌ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంట‌గా ఫస్ట్ టైం తిరుమల కిషోర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. హీరో చాలామందిని పెళ్లి చూపులు చూస్తాడు.. అయినా ఎవరూ నచ్చరు. ఆ తరువాత ఆయన నచ్చేలేదని చెప్పే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ లైన్ పైనే కామెడీని వర్కౌట్ చేశారు. ఇక చివరిసారిగా హీరో .. హీరోయిన్ పైనే ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆమె కూడా ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేదే కథ. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

- Advertisement -