మిషన్ భగీరథ అధికారులను అభినందించిన ఎర్రబెల్లి..

391
Errabelli Dayakar Rao
- Advertisement -

మిషన్ భగీరథను మరో అవార్డు వరించింది. విలువైన తాగునీటి వృథాను అరికట్టేందుకు మిషన్ భగీరథ విభాగం ప్రత్యేకంగా ప్రవాహ నియంత్రణ (ఫ్లో కంట్రోల్ వాల్వ్) పరికరాన్ని కొత్తగా ఉపయోగించింది. దీని వల్ల అన్ని నల్లాలకు ఒకే రకమైన ప్రవహం ఉంటోంది. ఈ ప్రత్యేక ఏర్పాటుతో నీటి ఆదాతో పాటు అందరికీ ఒకే తరహాలో నీటిని సరఫరా చేస్తున్న ఘనతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

Minister Errabelli

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేఖవత్ చేతుల మీదుగా మన రాష్ట్ర మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ జి.కృపాకర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ.ఎన్.సి.కృపాకర్ రెడ్డి నేతృత్వంలోని మిషన్ భగీరథ అధికారుల బృందాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం అభినందించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.

- Advertisement -