పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు

284
Rtc bus
- Advertisement -

పంజాగుట్ట దగ్గర ఆర్టీసీ బస్సులో కాల్పులు కలకలం రేపుతుంది. బస్సులో నుంచి దిగమన్నందుకు తుఫాకితో గాల్లోకి కాల్పులు జరిపాడు గుర్తు తెలియని వ్యక్తి. బస్సు రూఫ్‌ టాప్ నుంచి బుల్లెట్ బయటకు దూసుకెళ్లింది. నిందితుడు వెంటనే అక్కడి నుంచి బస్సు దిగి పరారయ్యాడు. బస్సు సికింద్రబాద్ నుంచి ఫిల్మ్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్ధలానికి చేరుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రమాదవ శాత్తు బుల్లెట్ ఎవరికి తగలకపోవడంతో బస్సులో ఉన్న వారందరూ ఉపిరి పిల్చుకున్నారు.

- Advertisement -