దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ భేటీ..

57
dil raju
- Advertisement -

సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిన్న జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యహారంపై హైదరాబాద్ ఫిలిం చాంబర్‌లో శుక్రవారం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు దిల్ రాజు, ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు ఛాంబర్‌కు చేరుకున్నారు.

ఈ సమావేశంలో వేతన సవరణ,వర్కింగ్ కండిషన్స్‌పై చర్చించనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుండి 10 మంది సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నుండి 10 మంది సభ్యుల ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, నిన్న నిర్మాతల మండలి ఇచ్చిన హామీతో ఈ రోజు నుండి కార్మికులు యధావిధిగా షూటింగ్స్‌కు హాజరు అవుతున్నారు.

- Advertisement -