ఆకట్టుకుంటున్న భారత్ ట్రైలర్‌..

253
- Advertisement -

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం భారత్. ఈ మూవీ నుండి కొద్దిసేపటి క్రితమే ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇటీవలే వివిధ రకాల గెటప్పుల్లో సల్మాన్ ని పోస్టర్లలో చూశాక దీని మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టైగర్ జిందా హై తర్వాత దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ సల్మాన్ కాంబో చేస్తున్న మూవీ కావడంతో హైప్ ఇంకాస్త పెరిగింది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌, దిశా పటానీ కథానాయికలు. ప్రభుత్వ అధికారిణిగా కత్రినా పాత్ర, లుక్‌ ఆకట్టుకుంటోంది. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ట్రైలర్‌లో విషయానికొస్తే.. సల్మాన్‌ ఉద్యోగం నిమిత్తం ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళతారు. అక్కడ కత్రినా అధికారిణిగా పనిచేస్తుంటారు. ‘మీ పేరేంటి?’ అని కత్రినా అడిగినప్పుడు.. ‘భారత్‌’ అని సల్మాన్‌ సమాధానమిస్తారు. అది విని కత్రినా షాకవుతారు. ‘దేశంపై ప్రేమతో మా నాన్న నాకు ‘భారత్‌’ అని పేరుపెట్టారు. ఆ పేరుకు ముందు, వెనక మరో పేరును జోడిస్తే.. దేశాన్ని అవమానించినట్లు అవుతుంది కదా..’ అంటూ సల్మాన్‌ అమాయకంగా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. భారత్‌ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిది? అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు.

- Advertisement -