విక్టరీ వెంకటేశ్ కూతురు అశ్రిత పెళ్లి రాజస్ధాన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అతి కొద్ది మంది అతిధుల మధ్యలో వీరి వివాహం జరుగనుంది. హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు ప్రేమ వివాహం చేసుకుంటుంన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ అంతా అక్కడికి చేరుకోగా, నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైతూ, సామ్తో , రామ్ చరణ్, ఉపాసన సల్మాన్ ఖాన్ మరి కొంతమంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ రోజు జరగనున్న పెళ్లి కార్యక్రమానికి టాలీవుడ్కి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అయితే వివాహం పైర్తిగా ప్రైవేటు కార్యక్రమంగా సాగడంతో ఫోటోలు చూడలేకపోతున్నామని కాస్త నిరాశగా ఉన్నారు వెంకీ అభిమానులు.
ఈ వేడుకకు హాజరైన రామ్ చరణ్ సతీమణి ఇప్పుడు ఆఫోటోలను తన ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈసందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ ఈవిధంగా కామెంట్ పెట్టారు. ‘కంగ్రాచ్యులేషన్స్ వెంకీ అంకుల్.. నీరు ఆంటీ.. ఆశ్రిత & వినాయక్. అందరికీ అల్ ది బెస్ట్. రానా దగ్గుబాటి.. Mr. C మీరిద్దరూ సూపర్’ అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. ఆ ఫోటోలలో వధూవరులతో పాటుగా వెంకటేష్.. ఆయన సతీమణి నీరజ, రామ్ చరణ్ దంపతులు ఉన్నారు. మరో ఫోటోలో రామ్ చరణ్, ఉపాసనలతో పాటు రానా కూడా ఉన్నారు. ఉపాసన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.